తెలంగాణలో మోడీ పర్యటన

     Written by : smtv Desk | Sat, Mar 23, 2019, 09:54 AM

తెలంగాణలో మోడీ పర్యటన

హైదరాబాద్‌: తెలంగాణలో బిజెపి లోక్‌సభ అభ్యర్థుల ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోడీ త్వరలో రాష్ట్ర పర్యటనకు రానున్నారు. మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌లలో నిర్వహించే బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ శుక్రవారం ప్రధాని మోడీతో ఫోన్‌లో మాట్లాడారు. అయితే 29న తెలంగాణ పర్యటనకు ప్రధాని మోడీ వచ్చేందుకు అంగీకరించనట్లు లక్ష్మణ్ తెలిపారు.29 మధ్యాహ్నం మహబూబ్‌నగర్‌ సభలో పాల్గొంటారు. అయితే హైదరాబాద్‌ సభ తేదీ ఇంకా ఖరారు కాలేదు. కిషన్‌రెడ్డి పోటీ చేస్తున్న సికింద్రాబాద్‌, మాజీ మంత్రి డి.కె.అరుణ బరిలో దిగుతున్న మహబూబ్‌నగర్‌ స్థానాలను గెలుచుకోవాలని పట్టుదలతో ఉన్నారు.





Untitled Document
Advertisements