నన్ను ప్రశ్నించే హక్కు లేదు : చంద్రబాబు

     Written by : smtv Desk | Sat, Mar 23, 2019, 09:57 AM

నన్ను ప్రశ్నించే హక్కు లేదు : చంద్రబాబు

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రానున్న ఎన్నికల నేపథ్యంలో తన పార్టీ ప్రచారంలో చాలా చురుకుగా పాల్గొంటున్నారు. నేడు విశాఖ జిల్లాలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్రమైన వాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడో అసలే అర్థం అవటం లేదు. ఒక అవినీతిపరుడైన వ్యక్తికీ నాకు సమన దూరం పాటించడంలో అర్థం లేదు. ఇప్పటికైనా పవన్ ఎవరి పక్షాన ఉంటాడో తేల్చుకోవాలని చంద్రబాబు అన్నారు. అంతేకాకుండా ఇప్పుడు వార్తల్లో నిలిచిన తెలంగాణ సీఎం కెసిఆర్ ని ప్రశ్నించే దమ్ము లేని పవన్ కళ్యాణ్ కి నన్ను ప్రశ్నించే హక్కు లేదని చంద్రబాబు అన్నారు.

ఈ రోడ్ షో లో జగన్ పైనా విరుచుకాడ్డాడు చంద్రబాబు. తన కేసుల్ని కప్పి పుచ్చుకునేందుకే అటు మోడీతో, ఇటు కెసిఆర్ తో కలిసి ఉంటూ వారికి ఊడిగం చేస్తున్నాడని చంద్రబాబు ఆరోపించారు. ఇప్పుడు, జగన్, కేసీఆర్, మోదీ అందరూ కలిసి రాష్ట్రంపై గద్దల్లా విరుచుకుపడి, రాష్ట్రాన్ని దోచుకునేందుకు సిద్ధపడ్డారని చంద్రబాబు మండిపడ్డారు. ఒకవేళ వారికి అధికారం వస్తే మాత్రం రాష్ట్రం ఏమైపోతుందోనని దిగులుగా ఉందని చంద్రబాబు అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు వారికీ తగిన బుద్ది చెబుతారని అన్నారు.





Untitled Document
Advertisements