టీడీపీ తీర్థం పుచ్చుకున్న కొణతాల

     Written by : smtv Desk | Sat, Mar 23, 2019, 10:03 AM

టీడీపీ తీర్థం పుచ్చుకున్న కొణతాల

అందరి ఆలోచనల్ని, అభిప్రాయాల్ని పటాపంచలు చేస్తూ ఒక సంచలనమైన నిర్ణయాన్ని తీసుకున్నారు మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ. గత కొంత కాలంగా కొణతాల వైసీపీ లో చేరతారని అందరు భావించారు కానీ చివరికి ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కానీ వైసీపీని కాదని టీడీపీలో చేరినా అక్కడా సీటు దక్కలేదు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన టీడీపీ అనుమతిస్తే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఆ ఆ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానని చెప్పారు.

అయితే మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర చర్చావేదిక కన్వీనర్‌‌గా ఉన్న కొణతాల రామకృష్ణ ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబును కలవగా ఆయన టీడీపీ లోనే చేరుతారనే దాదాపుగా ఖాయమైపోయిందనే అర్థమయ్యింది. కానీ కొణతాల తాజాగా టీడీపీకి మద్దతు ప్రకటించడంతో వైసీపీపై ప్రభావం ఉంటుందా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.





Untitled Document
Advertisements