బస్సులో చెలరేగిన మంటలు

     Written by : smtv Desk | Sat, Mar 23, 2019, 10:05 AM

బస్సులో చెలరేగిన మంటలు

బీజింగ్‌: చైనాలోని ఓ పారిశ్రామిక వాడలో జరిగిన పేలుడు ఘటన మరవక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. ఓ పర్యాటక బస్సులో మంటలు చెలరేగి 26 మంది చనిపోయిన సంఘటనా చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మధ్య చైనాలోని హ్యూనన్‌ ప్రావిన్స్‌ చాంగ్డే పట్టణంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 56 మంది ఉన్నట్లు సమాచారం. గాయ పడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. మరోవైపు గురువారం రసాయన పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 62కు చేరింది.





Untitled Document
Advertisements