మసీదుల్లో కాల్పులు : మృతులకు దుబాయ్‌ ఘన నివాళి

     Written by : smtv Desk | Sat, Mar 23, 2019, 07:51 PM

మసీదుల్లో కాల్పులు : మృతులకు దుబాయ్‌ ఘన నివాళి

దుబాయ్‌, మార్చ్ 23: దుబాయ్‌ పాలకులు న్యూజిలాండ్‌ క్రైస్ట్‌ చర్చ్‌ నరమేదంలో ప్రాణాలు కోల్పోయిన 50మందికి ఘనంగా నివాళ్లు అర్పించారు. న్యూజిలాండ్‌ లో ముస్లింలకు అండగా నిలిచిన ఆ దేశ ప్రధాని జెసిండాకు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు ప్రపంచంలోనే ఎత్తైన భవనం బుర్జ్‌ ఖలిఫాపై ముస్లింలను ఓదార్చుతున్న జెసిండా చిత్రాన్ని ఉంచి తమ కృతజ్ఞతను చాటుకున్నారు దుబాయ్‌ రాజు షేక్‌ మహమ్మద్‌ బిన్‌ రషీద్‌. న్యూజిలాండ్‌ లో కాల్పుల తరువాత జెసిండా బుర్ఖా దరించి మత సామరస్యాన్ని చాటారని గుర్తు చేశారు.





Untitled Document
Advertisements