మార్చ్ 23: ఫుట్బాల్ దిగ్గజ ఆటగాడు క్రిస్టియానొ రొనాల్డొకు ఓ సంస్థ భారీ షాక్ ఇచ్చింది. తాజాగా ఛాంపియన్ లీగ్ క్వార్టర్ఫైనల్లో అసభ్యకర సైగలు చేసిన రొనాల్డోకు భారీ నష్టపరిహారం విధించింది ఆ లీగ్ యాజమాన్యం. ఛాంపియన్స్ లీగ్లో భాగంగా నాకౌట్ దశ రెండో లీగ్ మ్యాచ్లో భాగంగా జట్టు అట్టెటికో మాడ్రిడ్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో జ్యువెంటస్ జట్టు 3 గోల్స్ చేసి అట్లెటికొ మాడ్రిడ్ను క్లీన్ స్వీప్ చేసింది. ఈమ్యాచ్లో జ్యూవెంటస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన రొనాల్డో ఒక్కడే మూడు గోల్స్ చేసి జట్టును ఆధిక్యంలో నిలిపి 3-0తేడాతో జువెంటస్ విజయం సాధించింది. అనంతరం విజయోత్సవ సంబరాల్లో భాగంగా రొనాల్డో ప్రత్యర్థి జట్టు పట్ల అసభ్యకర సైగలు చేశాడు. రొనాల్డో చేష్టలు తమ మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని అట్లెటికో కోచ్ డిగో సిమోన్ ఫిర్యాదు చేశాడు. దీంతో రొనాల్డొపై యూఈఎఫ్ఏ ఛాంపియన్ లీగ్ యాజమాన్యం 20వేల యూరోలు (అంటే రూ.15.65లక్షలు) జరిమానా విధించింది.