జగన్ సమక్షంలో వైసీపీ జెండాలు, ప్లెక్సీలు దగ్దం

     Written by : smtv Desk | Sat, Mar 23, 2019, 08:50 PM

జగన్ సమక్షంలో  వైసీపీ జెండాలు, ప్లెక్సీలు దగ్దం

మార్చ్ 23: పాడేరులో జరిగిన వైసీపీ అధినేత జగన్‌ ఎన్నికల ప్రచార సభ ఉద్రిక్తంగా మారింది. జగన్ సమక్షంలోనే పాడేరు వైసీపీ అభ్యర్థి భాగ్యలక్ష్మి, విశ్వేశ్వరరాజు వర్గీయులు వైసీపీ జెండాలు, ప్లెక్సీలను తగలబెట్టారు. ఇక అక్కడే ఉన్న పోలీసులు ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆ క్రమంలోనే వైసీపీ సీనియర్ నేత బాలరాజును పోలీసులు కొట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వైసీపీలో ఉన్న వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఈ క్రమంలోనే ఆయన వైసీపీకి రాజీనామా చేశారట. కాగా వైసీపీ తరుపున పాడేరు నియోజకవర్గం నుంచి భాగ్యలక్ష్మి బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో పాడేరు నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున గిడ్డి ఈశ్వరి గెలిచారు. రాజకీయ సమీకరణాల్లో భాగంగా ఆమె టీడీపీలో చేరారు. ఈ ఎన్నికల్లో టీడీపీ తరపున ఈశ్వరి పోటీ చేస్తున్నారు.





Untitled Document
Advertisements