జనసేన పార్టీకి గుడ్ బై చెప్పిన మరొక నేత

     Written by : smtv Desk | Sat, Mar 23, 2019, 09:03 PM

 జనసేన పార్టీకి గుడ్ బై  చెప్పిన మరొక నేత

ఏపీలో ఎన్నికలు దగ్గరవుతున్న కొద్దీ అక్కడి రాజకీయ వాతావరణం రోజురోజుకి ఉద్రేకంగా మారుతుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు అన్ని కూడా ప్రచారాల్లో మునిగిపోయాయి. కానీ ఇప్పటికి కూడా ప్రధాన పార్టీల్లో వలసలు మాత్రం తగ్గడం లేదు. రోజులు దగ్గరవుతున్న వేల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి మరొక ఎదురు దెబ్బ తగిలింది. మరొక ముఖ్య నేత జనసేన పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇటీవలే జనసేన పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే డీవై దాస్ జనసేనకు గుడ్‌బై చెప్పారు. ఈ నెల 18న టీడీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరిన ఆయన తాజాగా ఆ పార్టీకి కూడా గుడ్‌బై చెప్పారు.

పార్టీలో చేరిన వెంటనే తాను పామర్రు నుంచి పోటీ చేస్తానని పవన్ కు ముందే చెప్పానని, కానీ ఆ స్థానాన్ని బీఎస్పీకి కేటాయించామని, ఆ పార్టీతో మాట్లాడుకోవాలంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్‌నని కూడా చూడకుండా తనకు గౌరవం ఇవ్వట్లేదని వాపోయారు. ఉప్పులేటి కల్పనను గెలిపించేందుకే తనకు సీటు ఇవ్వలేదని ఆరోపించారు. తనకు సీటు ఇవ్వకపోవడం వెనుక టీడీపీ హస్తం ఉందని పేర్కొన్నారు. అందుకనే జనసేన పార్టీకి వీడ్కోలు పలికానని చెప్తున్నారు.





Untitled Document
Advertisements