జకార్తా: ఆదివారం ఇండోనేషియాలో ఉత్తర మలక్కా ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్స్కేల్పై దీని తీవ్రత 6.6గా నమోదైంది.ఇండోనేషియాలో టెర్నెట్కు 150 కిలోమీటర్ల దూరంలో 37 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. అత్యంత ప్రమాదకరమైన రింగ్ఆఫ్ ఫైర్ జోన్లో ఇది ఉంది. అతి తక్కువ సమయం మాత్రమే భూప్రకంపనలు రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది.