బాలీవుడ్ హీరో ఉదయ్ చోప్రా కి ఏమైంది ...

     Written by : smtv Desk | Sun, Mar 24, 2019, 04:47 PM

బాలీవుడ్ హీరో  ఉదయ్ చోప్రా కి ఏమైంది ...

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత... యశ్‌రాజ్ ఫిలింస్ అధినేత యశ్ చోప్రా కుమారుడు ఉదయ్ చోప్రా ట్విట్టర్‌లో షాకింగ్ ట్వీట్లు పెట్టాడు. తన పరిస్థితి బాగాలేదని... తనకు చనిపోవాలని ఉందన్నాడు. ప్రయత్నిస్తున్నానను కానీ ఓడిపోతూనే ఉన్నానంటూ పేర్కొన్నాడు. కొన్నిగంటలపాటు నా ట్విట్టర్‌ను డీయాక్టివేట్ చేశానని తెలిపాడు. చావుకి ద‌గ్గ‌ర‌గా ఉన్న‌ట్టు అనిపిస్తోంది... ఆత్మహత్య చేసుకోవడానికి ఇదే సరైన సమయం అనిపిస్తుందన్నారు ఉదయ్ చోప్రా. ఆయన చేసిన ఈ ట్వీట్లతో నెటిజన్లంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే ఉదయ్ చోప్రా ఎప్పుడూ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

ఉదయ్ చోప్రా చేసిన ట్వీట్లను చదవిని వారంతా ఆయన్ను ఓదార్చేందుక ప్రయత్నించారు. తొందరపడి అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దంటూ సుమదాయించారు. అయితే ఉదయ్‌ ఈ ట్వీట్‌ పెట్టిన కొద్ది నిమిషాల తర్వాతే డిలీట్‌ చేశారు. కానీ అప్పటికే నెటిజన్లు స్క్రీన్‌షాట్లు తీసేశారు. దీంతో ఇప్పుడీ వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. గతేడాది కూడా ఉదయ్‌ ట్విటర్‌లో ఓ పోస్ట్‌ పెడుతూ.. ఒత్తిడి, ఒంటరితనంతో బాధపడుతున్నవారిని దగ్గరికి తీసుకుని ఓదార్చాలని, సాయం అడగడంలో ఎలాంటి తప్పులేదన్నారు. అలాంటి ఆయన ఉన్నట్టుండి ఆత్మహత్య గురించి ఆలోచించడం ఏంటని బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. 'ధూమ్‌', 'ధూమ్‌ 2', 'ప్యార్‌ ఇంపాజిబుల్‌' వంటి చిత్రాల్లో ఉదయ్‌ చోప్రా నటించారు. ఆ తర్వాత ఆయనకు బాలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు రాలేదు. చాలా కాలం తర్వాత ఆయన అమెరికా నుంచి ముంబయి వచ్చినప్పుడు బాగా లావైపోయి గుర్తుపట్టలేనంతా మారిపోయారు.





Untitled Document
Advertisements