బిజెపి 64 మంది అభ్యర్థుల జాబితా విడుదల

     Written by : smtv Desk | Sun, Mar 24, 2019, 04:47 PM

బిజెపి 64 మంది అభ్యర్థుల జాబితా విడుదల

న్యూఢిల్లీ, మార్చ్ 24: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బిజెపి శనివారం మరో 64 మంది అభ్యర్థుల్ని ప్రకటించింది. పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు పాట్నా, బిజెపి జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్రకు ఒడిశాలోని పూరీ స్థానాల్న కేటాయించారు. బిజెపి విడుదల చేసిన తాజా జాబితాతో కలిపి ఆ పార్టీ ఇప్పటికి మొత్తం 249 స్థానాలకు లోక్‌సభ అభ్యర్థుల్ని ప్రకటించింది. తాజా జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి 23, తెలంగాణ, మహారాష్ట్ర నుంచి ఆరుగురు, ఒడిశా అయిదుగురు, ఉత్తరప్రదేశ్ ముగ్గురు, అస్సోం, కేరళ, మేఘాలయ నుంచి ఒక్కొక్కరు, బీహార్‌లో బిజెపి జెడి (యు), ఎల్‌జెపితో కలిసి పోటీ చేస్తుంది. ఆ రాష్ట్రం నుంచి 40 మంది అభ్యర్థుల్ని ప్రకటించగా, వారిలో 17 మంది బిజెపి, మరో 17 మంది జనతాదళ్ (యు), లోక్‌జనశక్తి పార్టీ నుంచి ఆరుగురు అభ్యర్థులున్నారు.





Untitled Document
Advertisements