మార్చ్ 24: స్మార్ట్ ఫోన్ తయారి సంస్థ 'హువావే' ఈ మధ్య మేట్ ఎక్స్ ఫోల్డబుల్ పేరిట ఓ నూతన మడతబెట్టే 5జీ ఫోన్ను బార్సిలోనాలో విడుదల చేసింది. కాగా ఈ ఫోన్ను త్వరలో భారత మార్కెట్లో విడుదల చేయనున్నారు. దీంతో భారత్లో విడుదల కానున్న తొలి 5జీ స్మార్ట్ఫోన్ ఇదే కానుంది. ఇక ఈ ఫోన్ ధర రూ.1,85,220 గా ఉంది.
ఫోన్ ఫీచర్లు :
* 6.6 ఇంచుల డిస్ప్లే,
* 6.38 ఇంచుల సెకండరీ డిస్ప్లే,
* కైరిన్ 980 ప్రాసెసర్,
* ఆండ్రాయిడ్ 9.0 పై,
* ఫింగర్ ప్రింట్ సెన్సార్,
* 40, 16, 8 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు,
* 4500 ఎంఏహెచ్ బ్యాటరీ,
* సూపర్ చార్జ్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.