పుల్వామా దాడి గురించి ముందే తెలుసు : దిగ్విజయ్

     Written by : smtv Desk | Sun, Mar 24, 2019, 09:02 PM

పుల్వామా దాడి గురించి ముందే తెలుసు : దిగ్విజయ్

ఇండోర్, మార్చ్ 24: కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో పుల్వామా దాడి గురించి ప్రస్తావిస్తూ...ఇంటెలిజెన్స్ లోపం వల్లే ప్రమాదం సంభవించిందని ఆరోపించారు. అందుకే ప్రధాని ఈ అంశంపై మౌనం వహిస్తున్నారన్నారు. అలాగే బాలాకోట్‌పై వైమానిక దళం చేసిన దాడులపై తాను అనుమానాలు వ్యక్తం చేయలేదన్నారు. అంతర్జాతీయ మీడియా లేవనెత్తుతున్న ప్రశ్నలకు కేంద్రం సమాధానం చెప్పాల్సి ఉంటుందని సూచించానన్నారు. దాడి జరగడానికి ఆరు రోజుల ముందే కశ్మీర్ ఐజికి సమాచారం ఉందని తెలిపారు. భారీ ఎత్తున సిఆర్‌పిఎఫ్ బలగాలతో కాన్వాయ్‌ను తరలించడంపై ఆయన ముందుగానే హెచ్చరికలు జారీ చేశారన్నారు.





Untitled Document
Advertisements