పెరిగిన ఇంధనం ధరలు

     Written by : smtv Desk | Fri, Apr 12, 2019, 12:36 PM

పెరిగిన ఇంధనం ధరలు

శుక్రవారం దేశీయ ఇంధన ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.72.86 వద్ద కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.66.19 వద్ద ఉంది. వాణిజ్య రాజధాని ముంబయిలో పెట్రోల్ ధర రూ.78.43 వద్ద, డీజిల్ ధర రూ.69.27 వద్ద కొనసాగుతోంది. ఇక హైద‌రాబాద్‌లో పెట్రోల్ ధర రూ.77.26 వద్ద ఉంది. డీజిల్ ధర రూ.71.92 స్థాయి వద్ద కొనసాగుతోంది. అమరావతిలో పెట్రోల్‌ ధర రూ.76.98 వద్ద, డీజిల్‌ ధర రూ.71.30 వద్ద ఉంది. ఇక విజయవాడలో పెట్రోల్ ధర రూ.76.61, డీజిల్ ధర రూ.70.96 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.21 శాతం పెరుగుదలతో 70.98 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.30 శాతం పెరుగుదలతో 63.77 డాలర్లకు ఎగసింది.





Untitled Document
Advertisements