శనివారం ఉదయం అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ భూకంపం సంభవించిం. భూకంప తీవ్రత 4.7గా రిక్టర్ స్కేల్ పై నమోదు అయ్యింది. ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. ఫిబ్రవరి 28న కూడా నికోబార్ దీవుల్లో 4.8 తీవ్రతతో భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. మార్చి 23వ తేదీన కూడా పది నిమిషాల వ్యవధిలోనే అండమాన్ దీవుల్లో 5.1 తీవ్రతతో రెండు సార్లు భూమి కంపించింది. వరుస భూకంపాలతో నికోబార్ దీవుల్లో నివసించే ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.