బీఎస్‌ఎన్‌ఎల్ యూజర్స్ కి గుడ్ న్యూస్

     Written by : smtv Desk | Sat, Apr 13, 2019, 12:52 PM

బీఎస్‌ఎన్‌ఎల్ యూజర్స్ కి గుడ్ న్యూస్

న్యూఢిల్లీ: భారత ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారుల కోసం నూతన ఆఫర్లను ప్రవేశపెట్టింది. సరికొత్త ఫుల్ టాక్‌టైమ్, ఎక్స్‌ట్రా టాక్‌టైమ్ టాపప్-160తో రీఛార్జీ చేసుకున్న వారికి రూ.180 టాక్‌టైమ్ లభించనున్నదని, ఈ ప్యాకేజీ ఈ ఆదివారం వరకు మా త్రమే అమలులో ఉంటుందని తెలంగాణ టెలికం సర్కిల్ సీజీఎం వీ సుందర్ ఒక ప్రకటనలో తెలిపారు. టాపప్-500తో రీఛార్జీ చేసుకున్నవారు రూ. 550 పొందవచ్చును. మే 31 వరకు వర్తిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లోని ప్రీపెయిడ్ మొబైల్ వినియోగదారుల కోసం ఈ ఆఫర్లను తీసుకొచ్చిన్నట్టు ఆయన తెలిపారు.





Untitled Document
Advertisements