IPLలో RCB భోని...మొదటి ఘన విజయం

     Written by : smtv Desk | Sun, Apr 14, 2019, 12:06 PM

IPLలో RCB భోని...మొదటి ఘన విజయం

ఐపీఎల్ 2019 సీజన్‌లో నేడు మొహాలి వేదికగా జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మొదటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ లో కోహ్లి (67: 53 బంతుల్లో 8x4), ఏబీ డివిలియర్స్ (59 నాటౌట్: 38 బంతుల్లో 5x4, 2x6) అర్ధశతకాలు బాదడంతో 8 వికెట్ల తేడాతో బెంగళూరు ఘన విజయాన్ని అందుకుంది. అంతకముందు క్రిస్‌గేల్ (99 నాటౌట్: 64 బంతుల్లో 10x4, 5x6) చెలరేగడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేయగా.. లక్ష్యాన్ని బెంగళూరు మరో 4 బంతులు మిగిలి ఉండగానే 174/2తో ఛేదించింది. తాజా సీజన్‌లో ఏడో మ్యాచ్‌ ఆడిన బెంగళూరుకి ఇదే తొలి విజయం. మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడిన ఏబీ డివిలియర్స్‌కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. 174 పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనర్ పార్థీవ్ పటేల్ (19) తక్కువ స్కోరుకే వెనుదిరిగినా.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఏబీ డివిలియర్స్‌తో కలిసి విరాట్ కోహ్లీ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో అర్ధశతకం పూర్తి చేసుకున్న కోహ్లీ.. రెండో వికెట్‌కి అభేద్యంగా 85 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే.. జట్టు స్కోరు 128 వద్ద కోహ్లీ ఔటవగా.. అనంతరం జోరు అందుకున్న ఏబీ డివిలియర్స్.. ఆఖర్లో స్టాయినిస్ (28 నాటౌట్: 16 బంతుల్లో 4x4)తో కలిసి గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశాడు.





Untitled Document
Advertisements