మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే ఐసీసీ వరల్డ్ కప్ కు భారత్ టీంను బీసీసీఐ తాజాగా ప్రకటించింది. త ఆరునెలలుగా భారత క్రికెటర్ల ఆటతీరుని నిశితంగా పరిశీలించిన సెలక్టర్లు.. అనుభవం, ప్రదర్శన ఆధారంగా 15 మందితో కూడిన టీమ్ని ఎంపిక చేశారు. ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, హెడ్ కోచ్ రవిశాస్త్రితో సుదీర్ఘ చర్చల తర్వాత ఈ టీమ్ని ప్రకటించారు. వాస్తవానికి ప్రపంచకప్ కోసం జట్టుని ప్రకటించే గడువు ఈ నెల 23 వరకూ ఐసీసీ ఇచ్చింది. కానీ వారం ముందే భారత్ ప్రకటించడం విశేషం. గడువులోపు ఐసీసీ అనుమతి లేకుండానే జట్టులో మార్పులు చేసుకునే సౌలభ్యం ఉంది.
ప్రపంచకప్లో తలపడే భారత్ జట్టు : విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ (రిజర్వ్ ఓపెనర్), విజయ్ శంకర్, మహేంద్రసింగ్ ధోని (వికెట్ కీపర్), కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్ (రెండో వికెట్ కీపర్), చాహల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ.