ప్రముఖ మలయాళీ నటి సాయి పల్లవి తాజాగా ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తను ఎప్పటికీ వాణిజ్య ప్రకటనల్లో నటించను అని చెప్పేసింది. ఇందుకు కారణం మేకప్ వేసుకోవడమట. ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న ఈమె ఇప్పటి వరకు ఒక్క వాణిజ్య ప్రకటనలోనూ నటించలేదు. ఇకపై కూడా నటించదట. ప్రకటనల్లో నటించను, ఆహ్వానిస్తే సామాజిక కార్యక్రమాలకు వెళ్తా.. అది కూడా ఎలాంటి మేకప్ వేసుకోకుండా అని అంటోంది సాయిపల్లవి. ఈ కారణంగా ఓ పెద్ద డీల్లను కూడా ఆమె వదులుకున్నారు. ప్రముఖ ఉత్పత్తుల సంస్థ తమ ఫేస్ క్రీమ్కు ప్రచారకర్తగా ఉండమని ఆమెను కోరారు. ఇందుకు పారితోషికంగా రూ.2 కోట్లు ఇస్తామని కూడా సంస్థ పేర్కొంది. కానీ.. మేకప్ వేసుకోకుండా సినిమాల్లో నటిస్తున్న తను, ఫేస్ క్రీమ్ వాడమని ప్రేక్షకులకు ఎలా చెబుతానని అన్నారట. 2కోట్లు ఇచ్చినా ఈ యాడ్ చేయను అని తేల్చి చెప్పారు.