నూతన ఓటర్లకు పోస్ట్‌ కార్డు ద్వారా ఓటు

     Written by : smtv Desk | Tue, Apr 16, 2019, 05:50 PM

నూతన ఓటర్లకు పోస్ట్‌ కార్డు ద్వారా ఓటు

అహ్మాదాబాద్‌: ఎన్నికల్లో ఓటు హక్కుపై అవగాహన పెంచేందుకు అహ్మాదాబాద్‌ జిల్లా కలెక్టర్‌ విక్రాంత్‌ పాండ్యే విన్నూత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు పోస్ట్‌ ఉద్యమాన్ని ప్రారంభించారు. అందులో భాగంగా మొదటిసారి ఓటు హక్కు పొందిన లక్ష వెయ్యి మంది ఓటర్లకు కలెక్టర్‌ పోస్ట్‌ కార్డు ద్వారా ఓటు వేయ్యాలని సందేశం పంపారు. యువతీ, యువకులు ప్రతీ ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని కలెక్టర్‌ విక్రాంత్‌ పాండ్యే తెలిపారు. ఈనెల 23న జరిగే మూడో విడత ఎన్నికల్లో అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్‌ కోరారు.





Untitled Document
Advertisements