ఎస్పిలోకి పూనమ్‌ సిన్హా

     Written by : smtv Desk | Tue, Apr 16, 2019, 07:56 PM

ఎస్పిలోకి పూనమ్‌ సిన్హా

ముంబై: ప్రముఖ సినీ నటుడు శతృఘ్నసిన్హా భార్య పూనమ్‌ సిన్హా అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ సమక్షంలో సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ఆమెను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు డింపుల్‌ యాదవ్‌. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌పై ఎస్పి-బిఎస్పీ కూటమి అభ్యర్థిగా పూనమ్‌ సిన్హా పోటీ చేయనున్నట్లు తెలుస్తుంది. లక్నో లోక్‌సభ నియోజకవర్గానికి రాజ్‌నాథ్‌ ఇవాళ నామినేషన్‌ దాఖలు చేశారు. శతృఘ్నసిన్హా కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌పై పాట్నా సాహిబ్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరుపున పోటీ చేస్తున్నారు.





Untitled Document
Advertisements