ఇలాంటి మ్యాచుల్లో ఎవర్నీ విమర్శించలేం : రహానె

     Written by : smtv Desk | Wed, Apr 17, 2019, 04:00 PM

ఇలాంటి మ్యాచుల్లో ఎవర్నీ విమర్శించలేం : రహానె

మొహాలి: మంగళవారం మొహలి వేదికగా జరిగిన మ్యాచ్ లో పంజాబ్ చేతిలో రాజస్తాన్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ ఓటమిపై రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ అజింక్యా రహానె స్పందించాడు. ఈ సందర్భంగా రహానె మాట్లాడుతూ...'ఈ వికెట్‌పై 183 పరుగుల లక్ష్యం ఛేదించడం పెద్ద కష్టమేమీ కాదు. అందుకు తగ్గట్టుగానే బ్యాటింగ్‌లో మాకు మంచి ఆరంభం లభించింది. ఆ తర్వాత స్టువర్ట్‌ బిన్నీ కూడా విజయ తీరానికి చేర్చేందుకు బాగా కష్టపడ్డాడు. కానీ, అవసరమైన సమయంలో పరుగులు రాబట్టడంలో విఫలమవడంతో మ్యాచ్‌ చేజారిపోయింది. ఛేదనలో ఆఖరి ఓవర్లు చాలా కీలకం. 15 ఓవర్ల తర్వాత ఛేదన మరింత క్లిష్టంగా ఉంటుంది. మేం కేవలం రెండు సిక్సుల దూరంలో ఆగిపోయాం' అని రహానే తెలిపాడు. స్వల్ప తేడాతో ఓడిపోయిన ఇలాంటి మ్యాచుల్లో ఎవర్నీ విమర్శించలేమని రహానె తెలిపాడు.





Untitled Document
Advertisements