చెన్నై: తమిళనాడులోని వేలూరులో ఎన్నికల ప్రచారం ముగిసి ఇంకో రెండు రోజుల్లో ఎన్నికలు జరుగుతాయి అనే క్రమంలో అక్కడ సంచులకొద్ది దొరికిన డబ్బు కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడ ఎన్నికలు రద్దు చేయాలని ఎన్నికల సంఘం భావించి అనుకున్న పనే చేసింది. ఈ నేపథ్యంలో అక్కడ పోలింగ్ను రద్దు చేయాలని సిఫార్సు చేస్తూ ఏప్రిల్ 14న ఈసి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు ప్రతిపాదనలు పంపింది. ఇందుకు మంగళవారం, రాష్ట్రపతి అంగీకరించడంతో అక్కడ ఎన్నిక రద్దయింది. కాగా, ఇటీవల వెల్లూరులో ఈసి, ఐటి నిర్వహించిన సోదాల్లో స్థానికి డిఎంకే పార్టీ కార్యాలయంలో భారీగా నగదు పట్టుబడింది. అందుకే ఈసి ఈ నిర్ణయం తీసుకుంది. వేలూరు ఎన్నిక రద్దుతో 38 స్థానాల్లో పోలింగ్ జరగనుంది.