మరో నాలుగు రోజులపాటు వర్షాలు

     Written by : smtv Desk | Thu, Apr 18, 2019, 11:16 AM

మరో నాలుగు రోజులపాటు వర్షాలు

తెలంగాణలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. బుధవారం 62 చోట్ల ఉదయం8గంటల నుంచి సాయంత్రం వరకు ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ వర్షానికి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో నలుగురు పిడుగుపాటుకు గురై మృతి చెందగా, మరొకరు గోడకూలి మృతి చెందారు.

బంగాళాఖాతం ఆగ్నేయ ప్రాంతంలో హిందూ మహాసముద్రాన్ని అనుకుని ఉన్న ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా నేటి నుంచి మరో నాలుగు రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.





Untitled Document
Advertisements