కర్ణాటకలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం నడుస్తోంది. నేతలు ఒకరిపై ఒకరు ఘాటైన విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కర్నాటక సీఎం కుమారస్వామిపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే రాజు కాగే అనుచిత వ్యాఖ్యలు చేశాడు. వారం క్రితం కుమారస్వామి ఒక ర్యాలీలో ప్రధాని మోదీని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఆయన రోజు కెమెరా, జనం ముందుకు రావాలంటే మేకప్ తప్పనిసరని, ఆ తర్వాత కూడా పౌడర్ రాసుకునే మీడియా ముందుకు వస్తారని విమర్శించారు.
దీనిపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే రాజు కాగే స్పందిస్తూ.. ప్రధాని మోదీ రోజుకు 10 సార్లు పౌడర్ రాసుకుంటారని, పదిజతల బట్టలు మారుస్తారంటూ కుమారస్వామి అన్నారని, మోదీ అందంగా.. తెల్లగా ఉంటారని, కానీ కుమారస్వామి వంద సార్లు స్నానం చేసినా గేదెలాగానే ఉంటారంటూ విమర్శించాడు.