కొత్త రూ.50 నోటు

     Written by : smtv Desk | Thu, Apr 18, 2019, 03:28 PM

కొత్త రూ.50 నోటు

న్యూఢిల్లీ: దేశంలో నోట్ల రద్దు అనంతరం ఆర్బీఐ కొత్త నోట్లను విడుదల చేస్తూ వస్తుంది. ఈ క్రమంలో తాజాగా రూ.50 నోటు నూతన సిరీస్ చలామణిలోకి తెస్తోంది. గవర్నర్ శక్తికాంత దాస్ సంతకంతో మహాత్మా గాంధీ బొమ్మ ఉండే కొత్త సిరీస్ రూ.50 నోటు త్వరలోనే చలామణిలోకి రానుందని ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) ప్రకటించింది. ఈ కొత్త సిరీస్‌తో పాటు పాత రూ.50 నోట్లు కూడా చెల్లుతాయని ఆర్‌బిఐ మంగళవారం ప్రకటించింది. 2017 ఆగస్టులో గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకంతో ఫ్లోరోసెంట్ నీలి రంగు కల్గిన కొత్త రూ.50 నోటును ఆర్‌బిఐ జారీ చేసిన విషయం తెలిసిందే.





Untitled Document
Advertisements