మాండ్య: ప్రముఖ సినీ నటి సుమలత అభ్యర్థులకు, నిఖిల్ కుమారస్వామి వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. మాండ్యలో గెలుపు విషయంలో సుమలత, నిఖిల్ వర్గీయులు పరస్పరం తీవ్ర స్థాయిలో దూషించుకున్నారు. ఈ క్రమంలో మాటా మాటా పెరిగి అది ఘర్షణకు దారి తీసింది. ఒక వర్గంపై మరో వర్గీయులు దాడి చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి వారిని అడ్డుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది.