హైదరాబాద్: బుధవారం రాత్రి హైదరాబాద్లో జరిగిన మ్యాచ్ లో చెన్నై ఓటమి పాలవడంతో ధోనీ అభిమానులు ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేస్తున్నారు. మ్యాచ్ జరిగిన అనంతరం అంబటి రాయుడు.. డేవిడ్ వార్నర్ ఫొటోను పోస్టు చేస్తూ.. రాయుడు ప్యాంట్ జేబులో వార్నర్ 3D కళ్లజోడు కోసం వార్నర్ వెతుకుతున్నాడేమో.. అని ఒకరంటే.. వరల్డ్ కప్ జట్టు ప్రకటించిన వెంటనే ధోనీ విశ్రాంతి తీసుకున్నాడు. ఇందులో ఏదో తెలియాల్సి ఉంది' అనే అనుమానం వ్యక్తం చేశాడు. ధోనీ లేని చెన్నై సూపర్ కింగ్స్ .. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు లాంటిది' అని కౌంటర్ వేసే వాళ్లతో పాటు ధోనీ లేని జట్టును ఊహించలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ.. సూపర్ కింగ్స్ జట్టుపై సానుభూతి వ్యక్తం చేస్తున్న వాళ్లు లేకపోలేదు.