రెండో విడత పోలింగ్ ముగిసింది

     Written by : smtv Desk | Thu, Apr 18, 2019, 05:58 PM

రెండో విడత పోలింగ్ ముగిసింది

న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల సందర్భంగా గురువారం ఉదయం ప్రారంభమయిన రెండో విడత పోలింగ్ ముగిసింది. ఆయా రాష్ట్రాల్లో ఇవాళ సాయంత్రం 5 గంటలతో పోలింగ్ సమయం ముగిసింది. కాగా, తమిళనాడులోని 38 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 వరకు, మధురైలో 8 గంటల వరకు పోలింగ్ జరగనుందని అధికారులు తెలిపారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ సమయం ముగిసింది. రెండో విడత లోక్ సభ ఎన్నికలు 11 రాష్ట్రాలు, 1 కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగాయి. ఏప్రిల్ 23న మూడో విడత పోలింగ్ 113 లోక్ సభ స్థానాలకు జరగనుంది.





Untitled Document
Advertisements