దక్షిణాఫ్రిక: త్వరలో ప్రారంభం కానున్న వరల్డ్ కప్ టోర్నీ కోసం తాజాగా దక్షిణాఫ్రికా 15 మందితో కూడిన జట్టుని ప్రకటించింది. సీనియర్ క్రికెటర్లు హసీమ్ ఆమ్లా, జేపీ డుమిని, ఇమ్రాన్ తాహిర్లకి అవకాశమిస్తూనే.. యువ ఆటగాళ్లని కూడా జట్టులోకి ఎంపిక చేసిన సెలక్టర్లు.. ఐపీఎల్ 2019 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున మెరుస్తున్న క్రిస్ మోరీస్కి మాత్రం మొండిచేయి చూపారు. అలాగే గాయంతో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్కి దూరమైన ఫాస్ట్ బౌలర్ లుంగి ఎంగిడిని కూడా ఎంపిక చేశారు.
దక్షిణాఫ్రికా జట్టు: డుప్లెసిస్ (కెప్టెన్), డికాక్ (వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, జేపీ డుమిని, హసీమ్ ఆమ్లా, ఆడిన్ మార్కరమ్, దుస్సేన్, డ్వైన్ ప్రొటీస్, ఆండ్లీ ఫెహ్లువాలియో, కగిసో రబాడ, డేల్ స్టెయిన్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నాట్రోజ్, ఇమ్రాన్ తాహిర్, షంషీ