ఇంగ్లాండ్ లో జరగబోయే ప్రపంచ కప్ కు ఆడనున్న భారత జట్టు సభ్యులు ఎవరు ఏ స్థానంలో ఆడాలనేది త్వరలో నిర్ణయిస్తామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నారు. వచ్చే నెల నుంచి వరల్డ్ కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో జట్టులో ఎవరు ఏ స్థానంలో ఆడాలనేది ఇంకా నిర్ణయించాల్సి ఉందని కోహ్లీ తెలిపారు. ఎప్పటి నుంచి టీమిండియాకు నాలుగో స్థానం బ్యాట్స్మెన్పై సందిగ్ధం నెలకొంది. ఈ నాలుగో స్థానానికి దినేష్ కార్తీక్, కేదర్ జాదవ్, కేఎల్ రాహుల్, విజయ్ శంకర్ లకు అవకాశం ఉంది. అయితే వీరిలో ఎవరిని తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఇదే విషయంపై నాలుగో స్థానంలో విజయ్ శంకర్ సరిగ్గా సరిపోతారంటూ పలువురు క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా నాలుగో స్థానానికి ఎవర్ని తీసుకుంటారనేది ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
అంతకు ముందు విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడారు. ప్రపంచ కప్ లో ఎంపికైన జట్టుపై తనకు నమ్మకం ఉందని పేర్కొన్నారు. డ్రెస్సింగ్ రూమ్లో ఆటగాళ్లు స్వేచ్ఛగా అభిప్రాయాలు వెల్లడించేందుకు ధోనీ, రోహిత్ చక్కని వాతావరణాన్ని సృష్టిస్తారు. అందరూ హాయిగా ఉంటారు. మా డ్రెస్సింగ్ రూమ్ లివింగ్ రూమ్లా ఉంటుంది’ అని విరాట్ అన్నాడు.