ఏనుగు బీభత్సం..ఇద్దరు మృతి

     Written by : smtv Desk | Fri, Apr 19, 2019, 03:00 PM

ఏనుగు  బీభత్సం..ఇద్దరు మృతి

భువనేశ్వర్ : ఒడిషాలో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. అంగుల్‌ జిల్లాలోని రెండు గ్రామాలపై దాడి చేసింది. ఈ దాడిలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. మొదట సాంధా గ్రామంలో ప్రవేశించిన ఏనుగు.. ఓ కుటుంబంపై దాడి చేసి ముగ్గుర్ని చంపేసింది. అనంతరం అదే గ్రామానికి చెందిన మరో మహిళపై దాడికి పాల్పడింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. మళ్లీ ఓ గంట తర్వాత సమీపంలోని సంత్‌పద్ గ్రామంలోకి ప్రవేశించిన ఏనుగు.. మరో వ్యక్తిపై దాడి చేసి చంపేసింది. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఏనుగును అక్కడి నుంచి తరిమికొట్టే ప్రయత్నం చేశారు.





Untitled Document
Advertisements