కొలంబో: నిఘా వర్ఘాలు చెప్పినట్టు గానే శ్రీలంకలో తాజాగా మరో బాంబు పేలుడు సంభవించింది. మెజిస్ట్రేట్ కోర్టు వెనుక ఖాళీ స్థలంలో బాంబు పేలింది. బాంబ్ బ్లాస్ట్ జరిగిన సమయంలో అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. పేలుడు ఘటనపై దర్యాప్తు చేప్టటారు శ్రీలంక పోలీసులు. ఈస్టర్ నాడు కొలంబోలో ఆత్మాహుతి దాడులు, వరుస బాంబు పేలుళ్ల ఘటన తరువాత శ్రీలంకలో హై అలర్ట్ ప్రకటించారు. పోలీసులు పలు ప్రాంతాల్లో బాంబులను స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేస్తున్నారు.