అత్యంత తక్కువ ధరలో జేవీసీ టీవీలు

     Written by : smtv Desk | Thu, Apr 25, 2019, 04:31 PM

అత్యంత తక్కువ ధరలో జేవీసీ టీవీలు

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ జేవీసీ ఇండియన్ మార్కెట్లో ఆరు కొత్త స్మార్ట్ ఎల్ఈడీ టీవీలను ఆవిష్కరించింది. వీటి ధర రూ.18,999 నుంచి ప్రారంభమౌతోంది. టీవీల స్క్రీన్ సైజ్ 40 నుంచి 55 అంగుళాల మధ్యలో ఉంది. జేవీసీ 40 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ టీవీ ధర రూ.18,999గా ఉంది. ఈ టీవీ కొనుగోలుపై ఎక్స్చేంజ్ ఆఫర్ రూపంలో రూ.8,000 వరకు తగ్గింపు పొందొచ్చు. ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కలిగినవారు 5 శాతం (రూ.1,250 వరకు) అదనపు డిస్కౌంట్ పొందొచ్చు. వీటన్నింటినీ కలుపుకుంటే రూ.9,749కే 40 అంగుళాల స్మార్ట్ టీవీని కొనొచ్చు. హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ వంటి యాప్స్ అన్ని ఈ టీవీల్లో పనిచేస్తాయి. మిరాక్యాస్ట్ సపోర్ట్ కూడా ఉంది. ఈ టీవీల్లో 1 జీబీ ర్యామ్, 8 జీబీ మెమరీ, క్వాడ్ కోర్ ప్రాసెసర్, 20 వాట్ సౌండ్ ఔట్‌పుట్, 2 యూఎస్‌బీ పోర్ట్స్, 2 హెచ్‌డీఎంఐ పోర్ట్స్ వంటి ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. వైఫై, ల్యాన్ వంటి కనెక్టివిటీ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. జేవీసీ కంపెనీ ఇన్-కార్ ఆడియో ఎక్విప్‌మెంట్, హెడ్‌ఫోన్స్, ప్రొజెక్టర్స్ వంటి వాటికి ఫేమస్. భారత్‌లో జేవీసీ టీవీలను వియారా గ్రూప్ మార్కెటింగ్ చేస్తుంది.





Untitled Document
Advertisements