శ్రీలంకలో ఉగ్రదాడి: @359కి చేరిన మృతుల సంఖ్య

     Written by : smtv Desk | Thu, Apr 25, 2019, 04:38 PM

శ్రీలంకలో ఉగ్రదాడి: @359కి చేరిన మృతుల సంఖ్య

కొలంబో: ఆదివారం శ్రీలంకలో జరిగిన దాడిలో మృతుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఈ బాంబు దాడుల్లో ఇప్పటివరకు 359 మంది చనిపోయినట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. ఈ దాడుల్లో చనిపోయిన 10 మంది భారతీయుల్లో 9 మృతదేహాలు బుధవారం బెంగళూరు, హైదరాబాద్ చేరుకున్నాయి. ఈ ఘాతుకం వెనుక సూత్రధారుల కోసం శ్రీలంక పోలీసులు దేశవ్యాప్తంగా జల్లెడ పడుతున్నారు. ఇప్పటివరకు 60మందిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. తాము అరెస్ట్ చేసిన 60మంది అనుమానితుల్లో అందరూ శ్రీలంకకు చెందిన తౌవీత్ జమాత్ సభ్యులేనని ఆ దేశ అధికారులు స్పష్టం చేశారు. సిమన్ గ్రాండ్, షాంగ్రిలా హోటళ్లపై దాడికి పాల్పడిన ఇద్దరు వారిద్దరూ సోదరులని తెలిపారు. వారి చిన్న తమ్ముడిని అరెస్ట్ చేశామని వెల్లడించారు. కొలంబో శివారులోని ఓ లాడ్జిలో బస చేసిన ఆత్మాహుతి బాంబర్ సంబంధీకులను అరెస్ట్ చేశారు. భద్రతా వైఫల్యాలనికి బాధ్యత వహిస్తూ పోలీసు చీఫ్ పుజిట్ జయసుందర, రక్షణ శాఖ సెక్రటరీ హెమసిరి ఫెర్నాండోలను రాజీనామా చేయాలని దేశ అధ్యక్షుడు మైతిపాల సిరిసేన ఆదేశించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.





Untitled Document
Advertisements