కామ రాక్షషుడు శ్రీనివాస్‌రెడ్డి ఇంటికి నిప్పంటించి....మీడియాను తరిమేసిన గ్రామస్తులు

     Written by : smtv Desk | Tue, Apr 30, 2019, 01:17 PM

కామ రాక్షషుడు శ్రీనివాస్‌రెడ్డి ఇంటికి నిప్పంటించి....మీడియాను తరిమేసిన గ్రామస్తులు

యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్‌లో సంచలనం రేపుతున్న శ్రావణి హత్య కేసులో నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి విచారణలో పలు సంచలన విషయాలను బయటపెట్టాడు. అయితే మంగళవారం అ గ్రామ ప్రజలు ఇంటిని గ్రామస్థులు చుట్టిముట్టి, దాడి చేసి నిప్పంటించారు. పోలీసుల భద్రత ఉన్నా లెక్కచేయకుండా నిప్పటించడంతో ఇంటిముందున్న పందిరి కాలిపోయింది. ఈ పరిణామాలతో ఉద్రిక్తలు తారాస్థాయికి చేరుకోగా, పోలీసులు అప్రమత్తమయ్యారు. తమ కళ్ల ముందు తిరుగుతూ మానవ మృగం చేతిలో తీవ్రంగా హింసించబడి, దారుణ హత్యకు గురైన అమ్మాయిలను తలచుకుని బాధపడుతున్న హజీపూర్ గ్రామస్థుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. గ్రామంలో వెలుగుచూసిన హత్యలు తీవ్ర కలకలం రేపగా, గతంలో అమ్మాయిల అదృశ్యంపై ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోలేదని, అందువల్లే దారుణాలు జరిగాయని ఆరోపిస్తూ నిరసనలకు దిగారు. ఈ క్రమంలో నిందితుడు శ్రీనివాస్ రెడ్డి ఇంటిని నాశనం చేసి, తగులబెట్టి, దీనిని చిత్రీకరించడానికి వెళ్లిన మీడియానూ కూడా వదల్లేదు. కవరేజ్‌కి వెళ్లిన మీడియా ప్రతినిధులు, కెమెరామెన్‌లపై ప్రజలు దాడికి దిగారు. తమ గ్రామానికి రావద్దంటూ వారితో వాగ్వాదానికి దిగి, కెమెరాలను ధ్వంసం చేశారు. ఆ సమయంలో రాచకొండ పోలీసులు అక్కడే ఉన్నా, వారిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదని మీడియా ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. తమ గ్రామంలోకి మీడియాను అనుమతించేది లేదని ప్రజలు స్పష్టం చేయడంతో చేసేదేమీ లేక వెనుదిరగాల్సి వచ్చింది. విద్యార్థిని శ్రావణితోపాటు కల్పన, మనీషా హత్యలకు కూడా శ్రీనివాసరెడ్డే కారణమని పోలీసులు భావిస్తున్నారు. నిందితుడు శ్రావణిని కీసర నుంచి తన ద్విచక్రవాహనంపై తీసుకెళ్లినట్లు సీసీ ఫుటేజీ ఆధారం లభించడంతో వారి అనుమానం మరింత బలపడింది. శ్రీనివాసరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. నిందితుడికి గతంలో నేరచరిత్ర ఉండటం, కర్నూలులో ఓ మహిళను హత్యచేసిన కేసులో బెయిల్‌పై బయటకొచ్చాడు. ఇక, శ్రావణి, మనీషా మృతదేహాలు లభ్యమైన బావి అతనిదే కావడంతో హత్యలు శ్రీనివాసరెడ్డే చేసినట్టు ప్రాథమికంగా నిర్ధరించారు. శ్రావణిని హత్యచేయడానికి ముందు అత్యాచారానికి పాల్పడినట్టు పోస్ట్‌మార్టమ్ రిపోర్టులో వెల్లడయ్యింది. దీంతో మార్చి 15న మనీషానూ కూడా ఇదే తరహాలో హత్యచేసి ఉంటాడని భావిస్తున్నారు. బొమ్మలరామారం నుంచి హాజీపూర్‌కు మధ్య దూరం 4 కిలోమీటర్ల కాగా, ఇక్కడకు వెళ్లాలంటే ఎక్కువగా కాలినడకనే ఆధారపడతారు. దీనిని నిందితుడు తనకు అనుకూలంగా మలుచుకుని శ్రావణినిపై హత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాదు, మనీషా హత్య జరిగి రోజులు గడిచినా ఎవరికీ అనుమానం రాకపోవడంతో తదుపరి లక్ష్యంగా శ్రావణి చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు.కర్నూలులో ఓ మహిళను హత్య చేసిన కేసులో శ్రీనివాసరెడ్డి ప్రధాన నిందితుడు. ఓ గుత్తేదారు వద్ద పనిచేస్తూ కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీలోని బిర్వారీ అపార్టుమెంటు పెంట్‌హౌస్‌ని శ్రీనివాసరెడ్డి అద్దెకు ఉండేవాడు. ఈ క్రమంలో 2016 డిసెంబరు 27న తన గదికి ఓ వేశ్యను తీసుకొచ్చాడు. అనంతరం ఆమెతో డబ్బు విషయంలో గొడవపడి ఆమె హత్యకు దారితీసింది. తన నలుగురు మిత్రులతో కలిసి ఆమెను హత్యచేసి, మృతదేహాన్ని పెంట్‌హౌస్‌పైనఉన్న నీళ్ల ట్యాంకులో పడేసి పరారయ్యారు. దీనిపై కేసు నమోదుచేసిన పోలీసులు నిందితులను 2017, మే 16న అరెస్టు చేశారు.





Untitled Document
Advertisements