టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా క్రేజ్ దక్కించుకున్న అనుష్కశెట్టి.. `భాగమతి` తర్వాత తెలుగులో సినిమాలేవీ చేయలేదు. అందుకు కారణం ఆమె తన బరువును తగ్గించుకునే పనిలో ఉండడమే. బరువు తగ్గిన అనుష్క 'సైలెన్స్' అనే సైలెన్స్ థ్రిల్లర్లో నటించడానికి రెడీ అయ్యింది. కోన వెంకట్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నఈ సినిమాలో అనుష్కతో మాధవన్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడో ప్రారంభం కావాల్సింది. అయితే అనుష్కకు వీసా సమస్య వచ్చింది. కండీషన్స్ కారణంగా అధికారులు అనుష్కకు ఫిబ్రవరిలో ఇష్యూ చేయాల్సిన ఏ వన్ వీసాను రీసెంట్గా ఇష్యూ చేశారట. దీంతో ఈ సినిమా చిత్రీకరణ కాస్త ఆలస్యం అయ్యిందట.