రెడ్‌మీ నోట్ 7ఎస్‌ కు ముహూర్తం ఫిక్స్

     Written by : smtv Desk | Thu, May 16, 2019, 01:19 PM

రెడ్‌మీ నోట్ 7ఎస్‌ కు ముహూర్తం ఫిక్స్

ప్రముఖ మొబైల్స్ త‌యారీదారు షియోమీ త‌న కొత్త స్మార్ట్‌పోన్ రెడ్‌మీ నోట్ 7ఎస్‌ను మే 20వ తేదీన రిలీజ్ చేయ‌నుంది. ఇటీవ‌లే విడుద‌లైన రెడ్‌మీ నోట్ 7, నోట్ 7 ప్రొ ఫోన్లు ఇండియాలో 20 ల‌క్ష‌ల‌కు పైగా యూనిట్లు అమ్ముడు కావడంతో వాటికి కొన‌సాగింపుగా రెడ్‌మీ నోట్ 7ఎస్ ఫోన్‌ను లాంచ్ చేయ‌నున్న‌ట్టు షియోమీ సంస్థ వెల్లడించిది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 48 మెగాపిక్స‌ల్ భారీ కెపాసిటీ ఉన్న కెమెరా ఉంది. దీంతోపాటు స్నాప్‌డ్రాగ‌న్ 730 ప్రాసెస‌ర్‌ను కూడా అమ‌ర్చారు. అయితే ఈ ఫోన్‌లోని ఇత‌ర ఫీచ‌ర్ల వివ‌రాల‌ను షియోమీ ఇంకా వెల్లడించలేదు.





Untitled Document
Advertisements