అమెరికాలో మళ్లీ నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించారు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. చైనా శత్రువుల నుంచి కంప్యూటర్ నెట్వర్క్కు ముప్పు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు పేర్కొన్నారు. నేషనల్ ఎమర్జెన్సీతో పాటు హువావేపై ఆంక్షలు విధించారు. అయితే అమెరికా అర్థంలేని ఆంక్షలు విధిస్తోందని విమర్శిస్తోంది హువావే. ఇక ట్రంప్ చర్యను మిత్రదేశాలు స్వాగతిస్తున్నాయి. నెట్ వర్క్ పరిరక్షణ కోసం కఠిన చర్యలు తప్పవంటున్నాయి.