ముస్లింలకు రంజాన్ నెల చాలా ప్రత్యేకమైందన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. వైట్హౌస్లో అధికారులకు, వివిధ దేశాల దౌత్యవేత్తలకు ఇఫ్తార్ విందు ఇచ్చిన ఆయన.. ఈ పండగ కుటుంబాలను, పొరుగువారిని దగ్గరికి చేరుస్తుందన్నారు. రంజాన్ మాసంలో ప్రజలు శాంతి, సహనంతో ఉండాలన్నారు.ఇక న్యూజిలాండ్, శ్రీలంక, కాలిఫోర్నియా, పిట్స్బర్గ్ ఉగ్రవాద దాడులపై విచారం వ్యక్తం చేశారు ట్రంప్.