రాజమండ్రి రైల్వేస్టేషన్‌లో గంటన్నర నిలిచిపోయిన ఏపీ ఎక్స్‌ప్రెస్

     Written by : smtv Desk | Thu, May 16, 2019, 04:00 PM

రాజమండ్రి రైల్వేస్టేషన్‌లో గంటన్నర నిలిచిపోయిన ఏపీ ఎక్స్‌ప్రెస్

విశాఖ నుంచి ఢిల్లీ బయలుదేరిన ఏపీ ఎక్స్‌ప్రెస్ రాజమండ్రి రైల్వేస్టేషన్‌లో గంటన్నర నిలిచిపోయింది. రైలులో ఏసీలు పని చేయటం లేదంటూ ప్రయాణికులు ఆందోళన చేశారు. దీంతో తాడేపల్లిగూడెంలో ఏసీ రిపేర్ చేయిస్తామని రైల్వే అధికారులు చెప్పటంతో ప్రయాణికులు శాంతించారు. సాంకేతిక లోపం వల్ల ఏసీ నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విశాఖపట్నం నుంచి గురువారం ఉదయం 8.30 గంటలకు బయలు దేరింది. మద్యాహ్నం 12.30 గంటలకు రాజమండ్రి రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. మరమ్మతులు అనంతరం రైలు బయలుదేరింది. అయితే ఏ3 బోగిలో మాత్రం ఏసీ పని చేయటం లేదు. ఆ బోగిలో ఏసీ మరమ్మతులు చేసేందుకు విజయవాడ నుంచి టెక్నిషియన్స్ తాడేపల్లిగూడెంకు బయలుదేరారు.





Untitled Document
Advertisements