భారత్ నుండి ముగ్గురు

     Written by : smtv Desk | Fri, May 17, 2019, 11:54 AM

భారత్ నుండి ముగ్గురు

ప్రపంచక్‌పలో భారత్‌ తరపున కామెంటేటర్లుగా హర్షా భోగ్లే, సంజయ్‌ మంజ్రేకర్‌, సౌరవ్‌ గంగూలీ ఎంపికయ్యారు. 46 రోజుల ఈ ఈవెంట్‌కు మొత్తం 24 మందితో కూడిన కామెంటరీ బృందాన్ని ఐసీసీ గురువారం లిస్ట్ ను విడుదల చేసింది . వీరిలో ఇంగ్లండ్‌ నుంచి నలుగురు, భారత్‌, న్యూజిలాండ్‌నుంచి ముగ్గురేసి, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌, ఆస్ర్టేలియా, పాకిస్థాన్‌ తరపున ఇద్దరేసి, బంగ్లాదేశ్‌, శ్రీలంక, జింబాబ్వే నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. అలాగే మరో ముగ్గురు మహిళలు కూడా వ్యాఖ్యాతలుగా ఉంటారు.

లిస్ట్ : నాసీర్‌ హుస్సేన్‌, మైకేల్‌ క్లార్క్‌, ఇయాన్‌ బిషప్‌, సౌరవ్‌ గంగూలీ, మిలేనీ జోన్స్‌, కుమార సంగక్కరా, మైకేల్‌ అథర్టన్‌, అలిసన్‌ మిచెల్‌, బ్రెండన్‌ మెకల్లమ్‌, గ్రేమ్‌ స్మిత్‌, వసీం అక్రమ్‌, షాన్‌ పొలాక్‌, మార్క్‌ నికోలస్‌, మైఖేల్‌ హోల్డింగ్‌, ఇషా గుహ, పొమ్మి ఎంబాగ్వా, సంజయ్‌ మంజ్రేకర్‌, హర్షా భోగ్లే, సిమోన్‌ డౌల్‌, ఇయాన్‌ స్మిత్‌, రమీజ్‌ రాజా, అధర్‌ అలీ ఖాన్‌, ఇయాన్‌ వార్డ్‌





Untitled Document
Advertisements