ఈ మధ్య ఐపీఎల్లో ఓ ఊపు ఊపిన క్రికెటర్లు అంతా ఇప్పుడు హాయిగా సేద తీరుతున్నారు. అయితే మళ్లీ మే 30వ తేదీ నుంచి ప్రపంచకప్ ప్రారంభం కానుండటంతో ఇందుకోసం క్రికెటర్స్ అంతా ఇంగ్లాండ్కు ప్రయానం కావాల్సి ఉంది. దీంతో ఈ రెండు టోర్నీలకు మధ్య దొరికిన విరామ సమయంలో సేద తీర్చుకొనేందుకు ముఖ్యంగా రోహిత్ సరదాగా కుటుంబంతో కలిసి మాల్దీవ్స్ వెళ్లారు. అక్కడ తన భార్య రితికా సజ్దే, కూతురు సమైరాతో పాటు కుటుంబసభ్యులతో కలిసి మాల్దీవుల్లో షికార్లు కొడుతున్నాడు. వీరికి సంబంధించిన ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్లో పెట్టాడు రోహిత్ శర్మ.
కాగా ఈ మధ్యనే ముగిసిన ఇండియన్ ప్రిమియర్ లీగ్లో ఛాంపియన్గా నిలిచిన ముంబై టీంకు రోహిత్శర్మ కెప్టెన్గా వ్యవహరించాడు. ముంబై ఖాతాలో నాలుగో టైటిల్ వేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు రోహిత్. ఛాంపియన్ జట్టులో ఐదుసార్లు సభ్యుడిగా ఉన్నాడు. కెప్టెన్గా రోహిత్శర్మ.. ముంబై ఇండియన్స్కు 104 మ్యాచుల్లో 60 విజయాలు కట్టబెట్టి 58.65 విజయాలు నమోదు చేశాడు. దీంతో వచ్చే ప్రపంచకప్ టోర్నీలో టీమిండియాలో కీలకమైన క్రికెటర్ గా రోహిత్ నిలవనున్నాడన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు.