యువ కథానాయకుడు నాగశౌర్య 'ఛలో' సినిమాతో నిర్మాతగా మారి విజయాన్ని అందుకున్నాడు. అయితే `@నర్తనశాల`తో డిజాస్టర్ను మూట కట్టుకున్నాడు. ఇప్పుడు రెండు సినిమాలను శౌర్య లైన్లో పెట్టాడు. అందులో ఒకటి తన బ్యానర్లో కొత్త దర్శకుడితో చేస్తుండగా మరో సినిమాను బయటి బ్యానర్లో చేయబోతున్నాడు.
ఈ రెండు సినిమాలు కాకుండా.. ఓ హిట్ డైరెక్టర్తో శౌర్య సినిమా చేయబోతున్నాడు. గత ఏడాది సుమంత్తో `సుబ్రహ్మణ్యపురం` సినిమాను డైరెక్ట్ చేసిన సంతోష్ జాగర్ల పూడి శౌర్య సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారట. సంతోష్ తన తొలి సినిమా తరహాలోనే రెండో సినిమాను కూడా సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తాడట. ఈ చిత్రంలో నాగశౌర్య తెలంగాణ ప్రాంత యువకుడిగా కనిపిస్తాడని టాక్. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారక ప్రకటన వెలువడుతుందట.