ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతగానో వరల్డ్కప్ కోసం ఎదురుచూస్తుండ్రు .. అయితే మరో రెండు వారాల్లో ఇంగ్లండ్ వేదికగా మెగా లోర్నీ అట్టహాసంగా ప్రారంభం కానున్నది. ఐతే ఈ సారి జరిగే వన్డే క్రికెట్ వరల్డ్కప్ చరిత్రలో నిలవనున్నది. టోర్నమెంటు చరిత్రలోనే మొట్టమొదటిసారి విజేత జట్టుకు అత్యధిక ప్రైజ్మనీ ఇవ్వనున్నారు. ఈ ఏడాది ఇంగ్లాండ్లో జరగనున్న వరల్డ్కప్లో..ఫైనల్ విజేతకు 28 కోట్ల క్యాష్ అవార్డు ఇవ్వనున్నారు. ఫైనల్స్లో గెలిచే జట్టుకు క్యాష్ అవార్డుతో పాటు ట్రోఫీని కూడా బహూకరిస్తారు. లార్డ్స్లో జూలై 16వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరగనున్నది. రన్నరప్గా నిలిచే జట్టుకు 14 కోట్ల ప్రైజ్మనీ వస్తుంది. సెమీఫైనల్ చేరిన జట్లకు 8 లక్షల డాలర్లు(5 కోట్ల 61 లక్షలు) ఇస్తారు. వరల్డ్కప్ టోర్నీ మొత్తం 46 రోజులు జరగనున్నది. ఇంగ్లండ్లోని 11 మైదానాల్లో ఈ మ్యాచ్లు జరుగుతాయి. లీగ్ దశలోనూ ప్రతి మ్యాచ్కు ప్రైజ్మనీ ఉంది.