న్యూఢిల్లీ: మే 30న ఇంగ్లాండ్ వేదికగా ఐసిసి ప్రపంచ కప్ టోర్నీ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. దీనికోసం అన్ని జట్లు తమ ఆటగాళ్లను మరింత బలంగా తీర్చిదిద్దే ప్రక్రియలో నిమగ్నమయ్యింది. ఇక టీమిండియా తరుపున ఆల్రౌండర్ కేదార్ జాదవ్ ఈ టోర్నీలో ఆడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఐపిఎల్ చివరి లీగ్ మ్యాచ్లో భాగంగా కేదార్ జాదవ్ భుజానికి గాయమైంది. దీంతో అతడు ప్రపంచ కప్ టోర్నీలో ఆడతాడా లేదా అని అనేక అనుమానాలు వచ్చాయి. కాని తాజాగా జాదవ్ గాయంనుంచి కోలుకున్నాడు. గురువారం జాదవ్కు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించి అతను ఫిట్గా ఉన్నాడని ప్రకటించాడు. దీంతో ఈ నెల 22న జట్టులోని మిగతా ఆటగాళ్లతో కలిసి ఇంగ్లాడ్ వెళ్లడానికి కేదార్ సిద్ధమవుతున్నాడు. మెగా టోర్నీలో మిడిలార్డర్ బ్యాట్స్మన్గా కేదార్ కీలకం కానున్నాడు. బ్యాట్తోనే కాకుండా బౌలింగ్ పరంగాను జట్టుకు జాదవ్ ముఖ్యమే. ఇటీవల జరిగిన ఐపిఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అతను మెరుగైన ప్రదర్శనే ఇచ్చాడు.