పుల్వామా ఎటాక్...పాక్ యువతి మాయలో భారత జవాన్

     Written by : smtv Desk | Sun, May 19, 2019, 11:09 AM

పుల్వామా ఎటాక్...పాక్ యువతి మాయలో భారత జవాన్

ఫిబ్రవరి 14న కాశ్మీర్ లోని పుల్వామలో జరిగిన ఉగ్రదాడిలో దాదాపు 40 మంది జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు వేగవంతంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో అధికారుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. పాకిస్థాన్ కు చెందిన ఓ యువతి హనీ ట్రాప్‌లో ఓ భారత జవాను చిక్కుకున్నారు. ఈ క్రమంలో సదరు జవాను ఆమెకు భారత ఆర్మీ రహస్యాలను చేరవేశాడు. ఈ క్రమంలో ఆమె తనకు తెలిసిన భారత ఆర్మీ రహస్యాలను జైషే ఉగ్రవాదులకు ఇచ్చిందని, దీంతో ఉగ్రవాదులు పక్కా ప్రణాళికతో పుల్వామా దాడికి పాల్పడినట్టు దర్యాప్తులో తేలింది. మధ్యప్రదేశ్‌కు చెందిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్), కేంద్ర నిఘా సంస్థల దర్యాప్తులో ఈ విషయం వెలుగు చూసింది. మధ్యప్రదేశ్‌లోని మోహోలో ఉన్న బీహార్ రెజిమెంట్‌లో అవినాశ్ కుమార్ (25) నాయక్ క్లర్క్‌గా పనిచేసేవాడు. 2018లో అతడు అసోంకు బదిలీ అయ్యాడు. అవినాశ్ కుమార్ తో ఓ పాకిస్థాన్ యువతితో వాట్సాప్ ద్వారా పరిచయం పెంచుకుంది. ఆమె వలలో చిక్కుకున్న అవినాశ్ భారత ఆర్మీ రహస్యాలను చేరవేశాడు. ఆ రహస్యాలను ఆమె జైషే ఉగ్రవాదులకు అందించేది. అవినాశ్ బ్యాంకు ఖాతాకు పాక్ నుంచి రూ.50 వేలు జమ అయినట్టు అధికారులు గుర్తించారు. అవినాశ్‌కు భోపాల్ ప్రత్యేక కోర్టు రిమాండ్ విధించింది.





Untitled Document
Advertisements