న్యూయార్క్: దిగ్గజ ఐటి కంపెనీ హెచ్పి ఎంటర్ప్రైజెస్...అమెరికాకు చెందిన సూపర్ కంప్యూటర్ల తయారీ సంస్థ క్రే ఐఎన్సిని కొనుగోలు చేసేందుకు సిద్దం అయ్యింది. ఈ డీల్ విలువ 1.4 బిలియన్ డాలర్లు అని సమాచారం. అంటే మన కరెన్సీలో రూ.9,848 కోట్లు. హైఎండ్ కంప్యూటింగ్లో పోటీని ఎదుర్కొనేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని హెచ్పి భావిస్తోంది. ఈ డీల్ కింద ఒక్కో షేరుకు 35 డాలర్లు (రూ.2,462) చెల్లిస్తోంది. గురువారం షేరు ధర ముగింపు కంటే ఇది 17 ఎక్కువగా ఉండడం గమనార్హం. ఐబిఎం సంస్థకు పోటీగా హెచ్పిని నిలిపేందుకు ఈ డీల్ ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.