సోషల్ మీడియాలో కోహ్లీ రికార్డ్!

     Written by : smtv Desk | Sun, May 19, 2019, 03:00 PM

సోషల్ మీడియాలో కోహ్లీ రికార్డ్!

న్యూఢిల్లీ: టీంఇండియా కెప్టెన్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఖాతాలోకి మరో రికార్డు నమోదయ్యింది. ఇప్పటివరకు సామాజిక మాద్యమాల్లో సచిన్, ధోనీలకు కూడా సాధ్యం కానీ ఫ్యాన్ పాలోయింగ్ ను కోహ్లీ సొంతం చేసుకున్నాడు. దీంతో అత్యధిక మంది ఫ్యాన్స్ ఉన్న క్రికెటర్ గా రికార్డ్ సృష్టించాడు. పలు సోషల్ మీడియాలో సైట్లలో కలిపి విరాట్ ఫాలోవర్లు సంఖ్య (10 కోట్ల) 100 మిలియన్లు మార్క్ చేరుకుంది. సోషల్ మీడియాలో ఫేమస్ అయిన ఫేస్‌బుక్ లో 3.7 కోట్లు, ఇన్ స్ట్రాగ్రామ్ లో 3.35 కోట్లు, ట్వీట్టర్ లో 2.94 కోట్ల మంది ఫాలోవర్స్ విరాట్ ను ఫాలో అవుతున్నారు.





Untitled Document
Advertisements