రోమ్: ఇటలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో రఫెల్ నాదల్ (స్పెయిన్), కరొలినా ప్లిస్కోవా (చెక్) టైటిల్స్ గెలుచుకున్నారు. ఆదివారం జరిగిన మహిళల ఫైనల్లో నాలుగో సీడ్ ప్లిస్కోవా 63, 64 తేడాత బ్రిటన్ క్రీడాకారిణి జొహనా కొంటాను ఓడించింది. ప్రారంభం నుంచే ప్లిస్కోవా దూకుడును ప్రదర్శించింది. మెరుగైన ఆటను కనబరుద్తూ చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకున్న ప్లిస్కోవా సెట్తో పాటు మ్యాచ్ను సొంతం చేసుకుని విజేతగా నిలిచింది.మరోవైపు పురుషుల సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ నాదల్ చిరకాల ప్రత్యర్థి, టాప్ సీడ్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా)ను ఓడించాడు. మూడు సెట్ల సమరంలో నాదల్ 60, 46, 61 తేడాతో జకోవిచ్ను చిత్తు చేసి అలవోకగా సెట్ను గెలిచి టైటిల్ దక్కించుకున్నాడు.